Chandana R

సీతారామ ప్రాజెక్ట్: సాగునీరు, బోనస్, రైతుల సమస్యలపై సమావేశం

తాజా సమావేశంలో సీతారామ ప్రాజెక్ట్, సాగునీటి ఆయకట్టు, పాత సీజన్ల బోనస్, వరి కొనుగోళ్లు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా గ్రామ స్థాయిలో ఎక్కడ ఏన్ని నియోజకవర్గాల్లో పనులు పూర్తయ్యాయి, ఎంత కాంట్రిబ్యూషన్ అందింది, వంటి వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రస్తుతంలో స్థిరీకరిస్తున్న 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఇప్పటికే ఉన్న ఆయకట్టులో చేర్చబడుతోందని, అదనంగా డిజైన్ చేస్తున్న పింక్ కలర్ ఆయకట్టును కూడా ప్రధాన కాలువలతో లింక్ చేస్తున్నారని తెలిపారు. కొత్త ఆయకట్టు…

Read More

యాంటీ డిఫెక్షన్ చట్టానికి తూట్లు? స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పులపై బిఆర్ఎస్ తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకుంటున్న నిర్ణయాలపై బిఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్పీకర్‌దే అయినప్పటికీ, ఆ చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పులు ఇస్తున్నారని వారు మండిపడుతున్నారు. బిఆర్ఎస్ వాదన ప్రకారం, పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో…

Read More

సర్పంచ్ ఎన్నికల ఫలితాలే సంకేతం: ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ వెనకడుగు?

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్‌కు వచ్చిన ఫలితాలు, రాబోయే ఎంపిటీసీ–జెడ్పిటీసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సభల్లో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే—సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు యాదృచ్ఛికం కాదు. “కారు గుర్తు లేకపోయినా గుబ గుయ్యి అనిపించింది. రేపు కారు గుర్తుతో ఎన్నికలు…

Read More

సర్పంచులకు బిల్లులు ఇవ్వకపోవడమే ఓటమికి కారణం – బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఆత్మవిమర్శ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ లేదా బీజేపీ కారణం కాదని, పార్టీ చేసిన తప్పులే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని డీబీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కొత్త సర్పంచులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ కేడర్‌ను పట్టించుకోలేదని, గ్రామస్థాయి నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేశామని కేటీఆర్ అంగీకరించారు. సర్పంచులు, ఎంపీటీసీలకు రావాల్సిన బిల్లులు ఇవ్వకపోవడం…

Read More

కాంగ్రెస్‌లో అంతర్గత అగ్నిపరీక్ష: మంత్రుల అహంకారంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిరంగ చర్చకు వచ్చాయి. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో బయటపడ్డ అంశాలు పార్టీని తీవ్ర అసౌకర్యంలోకి నెట్టాయి. మంత్రులను కలవడానికి వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని, గంటల తరబడి వేచిచూసేలా చేస్తున్నారని, నియోజకవర్గ సమస్యలపై స్పందన లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది విపక్షాల విమర్శ కంటే కూడా ప్రమాదకరమైన పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రులపై అసహనం వ్యక్తం…

Read More

అంత ఇంత గలీజ్ కాదు! నల్లగొండలో కాంగ్రెస్ పాలనలో వెలుగుచూసిన చిల్లర రాజకీయాల భయానక రూపం

రాజకీయం రోజురోజుకీ ఎంత దిగజారిందంటే, అది చూసి ప్రజాస్వామ్యానికే సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు రాజకీయ వ్యవస్థ ఎంత చిల్లర స్థాయికి పడిపోయిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా, నల్లగొండ నియోజకవర్గం, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికి వెళ్లిన యాదగిరి అనే వ్యక్తిపై అమానుషంగా దాడి…

Read More

వడి వడిగా మళ్లీ అడుగులా? థ్రిల్లర్‌తో రీఎంట్రీకి సిద్ధమవుతున్న ఐశ్వర్యా రజనీకాంత్!

సూపర్ స్టార్ రజనీకాంత్ వారుసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఐశ్వర్యా రజనీకాంత్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐశ్వర్య, ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్ వైపు దృష్టి సారించారు. దర్శకురాలిగా 3 సినిమాతో పరిచయమై, తొలి సినిమాతోనే డిఫరెంట్ అటెంప్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వెయ్ రాజా వెయ్, కాగం, లాల్ సలామ్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. అయితే దర్శకురాలిగా ఆమెకు ఆశించిన స్థాయిలో…

Read More

పంచాయతీ ఎన్నికల్లో బీసీలదే పైచేయి: జనరల్ స్థానాల్లో 52.75% విజయం, రాష్ట్రవ్యాప్తంగా విజయ బావట

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు (బీసీలు) ఘన విజయం సాధించాయి. బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాలకే పరిమితం కాకుండా, జనరల్ కేటగిరీ సీట్లలో కూడా అత్యధికంగా విజయం సాధించడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలిచింది. మొత్తం జనరల్ స్థానాల్లో ఏకంగా 52.75 శాతం బీసీలే గెలుచుకోవడం రాజకీయంగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో బీసీలకు 2,275 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీ,…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సజ్జనార్ నేతృత్వంలో బలోపేతమైన సిట్, నెలలో దర్యాప్తు పూర్తి ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తును మరింత బలోపేతం చేస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ, నెలరోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్, సిద్ధిపేట…

Read More

గ్రూప్–3 తుది జాబితా విడుదల: 1370 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

గ్రూప్–3 పరీక్షలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–3 పరీక్షల ఫలితాలు ఇప్పటికే ప్రకటించగా, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక గురువారం తుది జాబితాను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,370 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా 2023 నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలు నిర్వహించారు. అనంతరం…

Read More