రైతు గోడు వినిపించడంలేదా? మక్క రైతుల ఆవేదనపై మండిపడ్డ గ్రామీణ తెలంగాణ

తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందంటూ మక్క రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పంట కొనుగోళ్లు నిలిచిపోవడం, గోదాముల వద్ద కిలోమీటర్ల మేర లారీలు, ట్రాక్టర్ల క్యూలు కనిపించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. “ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నామని చెబుతోంది కానీ వాస్తవంగా పంట దిగుమతి చేయడం లేదు” అంటూ రైతులు మండిపడుతున్నారు. నాలుగు ఎకరాల్లో మక్క వేసిన రైతు జీవన్ మాట్లాడుతూ, “రోడ్డు మీదే పంట ఉంది, మార్కెట్‌లో అలాగే ఉంది,…

Read More

తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రమాణ స్వీకారం.. రాజ్యాంగ నిబద్ధతతో సేవ చేస్తానన్న సీఎం

తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్ విజయ్ శాసనసభలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో రాజ్యాంగ నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తానని విజయ్ ప్రకటించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. సభ ప్రారంభంలో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన తాత్కాలిక స్పీకర్, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులుగా సభకు వచ్చిన సభ్యులందరూ తమిళ ప్రజలకు సేవ చేయడం తమ ప్రధాన బాధ్యత అని…

Read More

వరుస బహిరంగ సభలకు కేసీఆర్ ప్లాన్… బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహాలపై ఫోకస్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చురుకుదనం పెంచేందుకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వరుస బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాల సభతో ప్రజల్లోకి తిరిగి వచ్చిన కేసీఆర్ ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడ సమయం ఇచ్చామని, ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని బీఆర్ఎస్ సిద్ధమవుతోందని…

Read More

ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో రాజకీయ కక్షలు: కేసీఆర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కుట్రలా?

ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. సిట్ విచారణ పేరుతో వరుసగా బిఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ కావడం, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణకు పిలవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ విచారణలు నిజమైన న్యాయ ప్రక్రియలో భాగమా? లేక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడులను లెక్కచేయకుండా రాజీ లేని…

Read More

న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…

Read More

సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యాయత్నం: బీసీల ఆవేదన, ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోంది

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం మరింతగా ఉధృతంగా మారుతోంది. తాజాగా సాయి ఈశ్వరాచారి అనే బీసీ యువకుడు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకోగా, స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనను తీన్మార్ మల్లన్న, బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ఆత్మహత్య…

Read More

బీసీ హక్కుల కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం… నేతలపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువతలో ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సాయికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ, బీసీల హక్కుల కోసం తాను ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యాడనడం అతని బాధ ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది. ఆత్మహత్యా యత్న సమయంలో సాయి “జై బీసీ… కాంగ్రెస్ మోసం చేసింది… న్యాయం కావాలి” అంటూ…

Read More

వెలిమెల గిరిజన భూముల దోపిడీపై ఎన్హెచ్ఆర్సి విచారణ – రాజకీయ నేతల చేతుల్లో న్యాయవ్యవస్థ బందీనా?

వెలిమెల—తెలంగాణ: వెలిమెల గిరిజన రైతుల భూముల అక్రమ స్వాధీనంపై నెలల తరబడి జరుగుతున్న పోరాటంలో కీలక మలుపు వచ్చింది. గిరిజన రైతుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఎన్హెచ్ఆర్సి (National Human Rights Commission) వెలిమెలకు వచ్చి విచారణ చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి సాక్ష్యాలు, రికార్డులు పరిశీలన కొనసాగుతోంది. రైతుల ఆరోపణల ప్రకారం, గత ప్రభుత్వంతో మొదలైన ఈ భూ కుంభకోణంలో రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కలిసి వందల ఎకరాల గిరిజన…

Read More

ఐబొమ్మ రవి అరెస్ట్‌పై పెరుగుతున్న చర్చ: పైరసీ, డేటా భద్రత & లీగల్ సెక్షన్స్‌పై హైకోర్టు అడ్వకేట్ వివరణ

ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొంతమంది అతన్ని “హీరో”గా చూస్తుండగా, మరికొందరు అతను చేసిన పైరసీ భారతీయ చిత్రపరిశ్రమను నేరుగా దెబ్బతీసిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు కూడా కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసుపై న్యాయపరమైన అంశాలు, సెక్షన్లు, పైరసీ వల్ల కలిగే ఆర్థిక నష్టం, డేటా మిస్యూస్ అవకాశాలు వంటి విషయాలపై హైకోర్టు అడ్వకేట్ పప్పి గౌడ్ గారు…

Read More

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో దొంగ ఓటు కలకలం — మహిళా ఓటర్‌ ఆవేదన

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటింగ్‌ ప్రశాంతంగా సాగుతుందని భావించిన వేళ, ఒక దొంగ ఓటు ఘటన కలకలం రేపింది. పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 67లో జరిగిన ఈ ఘటన ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక మహిళా ఓటర్‌ తన ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి రాగా, ఇప్పటికే ఆమె పేరుతో ఓటు వేసినట్లు అధికారులు తెలియజేశారు. దీనిపై ఆ మహిళా ఓటర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నా ఓటు వేరే వ్యక్తి వేసేశాడు, ఇది ఎలా…

Read More