బీసీలకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం పదేపదే చెబుతున్నప్పటికీ, పార్టీ నిర్ణయాల్లో ఆ హామీ ఎంతవరకు అమల్లో ఉందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పంచాయతీ ఎన్నికలకు ముందు సర్పంచ్ పదవులకు కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థులకు మద్దతు ఉంటుంది అని స్పష్టంగా చెప్పినప్పటికీ, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల వైరల్ అయిన మైనంపల్లి హనుమంతరావు ఆడియో ఈ చర్చను మరింత వేడెక్కించింది. ఆ ఆడియోలో, ‘అక్కడ నువ్వు నిలబడ్డా గెలవలేవు… అందుకే నీకు టికెట్ లేదు’ అని చెప్పిన మాటలు బీసీ నాయకుల మనసులో తీవ్ర ఆవేదనను రేకెత్తించాయి.
అభ్యర్థులు కష్టపడి పార్టీ కోసం పని చేస్తుంటే, ‘నువ్వు ఓడిపోతావు కాబట్టి అవకాశం లేదు’ అని ముందే తేల్చేయడం ఎలాంటి న్యాయం?
ఎన్నికలు ప్రజలు నిర్ణయిస్తారు… పార్టీ కాదు.
అభ్యర్థులు కష్టపడి పార్టీ కోసం పని చేస్తుంటే, ‘నువ్వు ఓడిపోతావు కాబట్టి అవకాశం లేదు’ అని ముందే తేల్చేయడం ఎలాంటి న్యాయం?
ఎన్నికలు ప్రజలు నిర్ణయిస్తారు… పార్టీ కాదు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ఉదాహరణ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. ఆ ఎన్నికల్లో:
- అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి
- మీడియా అంచనాలు కూడా అదే దిశలో వున్నాయి
- కానీ చివరికి నవీన్ యాదవ్ గెలిచారు
అయితే ఇప్పుడు అదే సర్వేలను ఆధారంగా చేసుకుని బీసీ నాయకులకు అవకాశం ఇవ్వకపోవడం అనేది ద్వంద్వ ధోరణి కాదా? అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.
బీసీ నాయకులు పోటీ చేస్తే ఓడిపోతారని ముందే తీర్పు ఇవ్వడం, ‘మీకు అవకాశం లేదు’ అని చెప్పడం, ఇక పార్టీ పరంగా “బీసీలకే ప్రాధాన్యం” అనే మాటలకు విరుద్ధంగా మారుతోంది.
బరిలో నిలబడి ఓడిపోవడం గెలుపే
కానీ
పోటీ చేసే హక్కే ఇవ్వకపోవడం అసలు ఓటమి
అంటూ మైనంపల్లి సమర్థకులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
కాంగ్రెస్ వర్గాలే కాదు, బీసీ సంఘాలు కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాయి:
“బీసీ హక్కులు మేనిఫెస్టోలో ఉన్న మాటలా? లేక నిజంగా అమలు అయ్యే విధానమా?”
ఈ వివాదంపై రేవంత్ రెడ్డి స్పందిస్తారా?
లేక ఇది మరో ‘పార్టీ లోపలే పుట్టిన కుల వివక్ష’ సమస్యగా మారుతుందా?
రాబోయే రోజుల్లో ఈ అంశం తెలంగాణ రాజకీయాలను కదిలించడం ఖాయం.

