తెలంగాణలో అతివృష్టి కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వికారాబాద్ వంటి జిల్లాల్లో భారీ వర్షాల ప్రభావంతో పంటలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. వరి, మక్కజొన్న, పత్తి సహా అనేక పంటలు కోత దశలో ఉండగానే వర్షాల వలన తడిసి మొలకలు రావడం, పాడైపోవడం, ఫంగస్ పట్టడం వంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, రైల్వే మార్గాలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో గృహోపకరణాలు కూడా నష్టపోయాయని ప్రజలు తెలుపుతున్నారు.
రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, పంటలు పూర్తిగా కోతకు వచ్చి ఉండటంతో భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడంతా నష్టపోయారని పేర్కొన్నారు. రైతుల పంట నిల్వలు, తాడులు, ధాన్యం కుప్పలు నీటితో నిండిపోయి పాడైపోయాయని తెలిపారు.
ప్రభుత్వం తక్షణం నష్టం వివరాలను సేకరించి రైతులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని, అధికారులు గ్రామాల్లో ప్రత్యక్ష పర్యటనలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
అలాగే, విద్యారంగంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, గ్రామ పంచాయతీ పనులకు సంబంధించిన బిల్లులు కూడా విడుదల చేయాలని వారు తెలిపారు. ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

