జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు: 100 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి
రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు శుక్రవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో సుమారు ₹100 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫార్మ్ హౌసులు, ఓపెన్ ఫ్లాట్లు,…

