పరిశుభ్రతపై ఫోకస్… మూడు కార్పొరేషన్లపై కఠిన ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి
రాజధాని నగరాల్లో పరిశుభ్రత, పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు ప్రధాన నగర పాలక సంస్థల పరిధిలో శుభ్రతను కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెత్త కనిపిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. పురపాలక శాఖ సమీక్షలో నగరాల అభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు, మౌలిక సదుపాయాలపై సమగ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి…

