మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం
రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

