జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓటు కలకలం — మహిళా ఓటర్ ఆవేదన
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుందని భావించిన వేళ, ఒక దొంగ ఓటు ఘటన కలకలం రేపింది. పోలింగ్ బూత్ నంబర్ 67లో జరిగిన ఈ ఘటన ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక మహిళా ఓటర్ తన ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి రాగా, ఇప్పటికే ఆమె పేరుతో ఓటు వేసినట్లు అధికారులు తెలియజేశారు. దీనిపై ఆ మహిళా ఓటర్ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నా ఓటు వేరే వ్యక్తి వేసేశాడు, ఇది ఎలా…

