తెలంగాణ రాజకీయాల్లో మీడియా–మంత్రుల నెక్సస్: బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చుట్టూ వివాదాలు
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో “చిచ్చు పెట్టేది ఎవరు?” అన్న ప్రశ్నే ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కుప్పకూలిపోతుందా? ఐఏఎస్ అధికారులు నిజంగా పనిచేస్తున్నారా? లేక మంత్రుల మధ్య, మీడియా మధ్య నడిచే లోపలి ఆటలే పరిపాలనను గందరగోళంగా మారుస్తున్నాయా? అనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఈ మొత్తం కథలో కీలకంగా వినిపిస్తున్న పేరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. భట్టి విక్రమార్కే ఈ వివాదానికి కేంద్ర…

