జీవో 59 ముసుగులో 50 వేల కోట్ల భూముల దోపిడీ?అర్ధరాత్రి కన్వేయన్స్ డీడ్లు, అనుమానాల నడుమ కొత్త POB లిస్ట్
బిఆర్ఎస్ హయాంలో జీవో నెంబర్ 59 పేరుతో అర్ధరాత్రి భూముల బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవో 59 కింద జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియలో దరఖాస్తులకు జత చేసిన పత్రాలను సరిగా పరిశీలించకుండానే, ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి…

