రాజకీయాల్లో రిటైర్మెంట్ కావాలి: యువతకు అవకాశం ఇవ్వాలని తీవ్ర డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం అవసరం ఉందని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలకు రిటైర్మెంట్‌ వ్యవస్థ లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధ నేతలు ఫీల్డ్‌లో తిరగలేని స్థితిలో ఉన్నప్పటికీ, పదవులు మాత్రం కావాలని, జీతాలు, సౌకర్యాలు, ప్రోటోకాల్‌లను ఆస్వాదిస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్యానికి నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “రాజకీయాల్లో కూడా వయస్సు పరిమితి ఉండాలి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టే ధైర్యం ఉంటే పెట్టండి”…

Read More

హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్ ఆరోపణలు నిరాధారాలు: పొంగులేటి

హిల్ట్ పాలసీ విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు విషపూరితం తప్ప నిజం కావని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హిల్ట్ పాలసీలోని రెండు ముఖ్య అంశాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలోనే వచ్చాయని, ఆ ఫైల్‌పై సంతకం చేసిన వ్యక్తి కూడా కేటీఆర్‌నే అని స్పష్టం చేశారు. “కోకాపేట్, నియా పాలసీ సమయంలో వేలాది కోట్లు విలువైన ఫ్లాట్లు, భూములు వేలానికి పెట్టింది ఎవరు?…

Read More

ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి: వచ్చే మార్చిలో లక్ష గృహ ప్రవేశాలు – మంత్రి పొంగులేటి

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గృహ నిర్మాణ శాఖ రెండు సంవత్సరాల ప్రగతిని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేశామని, ఇంకా మూడు లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇండ్లకు గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని, జూన్ నాటికి మరో రెండు లక్షల…

Read More

మాటలే నాయకుడి గౌరవం” – రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు, ధార్మిక ఉదాహరణలతో కౌంటర్

సంఘటన, వ్యాఖ్యలు, స్పందనలు — ఏది జరిగినా నాయకుడి మాటలే ఆయన స్థాయిని నిర్ణయిస్తాయి.అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. కొంతమంది ప్రజలు, ధార్మిక విశ్వాసాలను ఉదాహరణగా తీసుకుంటూ ఆయన వ్యాఖ్యలపై కఠిన విమర్శలు చేశారు.. 🔹 “నా స్థానం దేవుని దయతోనే” — ప్రజల భావోద్వేగ స్పందన ప్రజల్లో ఒకరు భావోద్వేగంగా ఇలా తెలిపారు: “కొద్దో గొప్పో ఉన్నా, దైవ సంకల్పం ఉండబట్టే…

Read More

జిహెచ్ఎంసి వార్డుల విభజనలో భారీ మార్పులు – 300కు పైగా వార్డులే లక్ష్యం

జిహెచ్ఎంసిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగం పెంచింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పైగా పెంచే దిశగా ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, జిహెచ్ఎంసి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత మూడు రోజులుగా టౌన్ ప్లానింగ్ అధికారుల సమీక్షలు, డేటా ఆధారంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం 27 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసిలో విలీనం కానున్న నేపథ్యంలో మొత్తం పరిధి, జనాభా పరిమాణం గణనీయంగా పెరగనుంది. లక్ష్యంగా ప్రభుత్వం ఓటర్ల…

Read More

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం: కాంగ్రెస్ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వేడి

ఖమ్మంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేతల వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయడం తమ బాధ్యత అని అన్నారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్‌కే వస్తారు”…

Read More

2047 రైజింగ్ తెలంగాణ: అభివృద్ధి విజన్‌నా? లేక రాజకీయ ప్రచారమా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన “రైజింగ్ తెలంగాణ 2047” రోడ్‌మ్యాప్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.ఈ విజన్‌ ద్వారా తెలంగాణను వచ్చే 20 ఏళ్లలో ప్రపంచ స్థాయి అభివృద్ధి రాష్ట్రంగా మార్చుతామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ప్రణాళికపై జనాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది —ఇది నిజమైన అభివృద్ధి దిశా ప్రణాళికనా? లేక రాజకీయ బ్రాండింగ్ పద్దతిలో మరో వాగ్దానమా? 🛠️ ప్రభుత్వం చెప్పిన లక్ష్యాలు సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో: ప్రభుత్వం ఇప్పటికే…

Read More

జర్నలిస్టులకు మళ్లీ నిరాశే: రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేం అయ్యాయి?

తెలంగాణలో ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మీడియా వర్గాలకు ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పొడిగించబడుతున్న అక్రిడిటేషన్ వ్యవస్థ, చిన్న, మధ్య తరహా పత్రికలను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టిందని మీడియా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇల్లు స్థలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌లో…

Read More

నియో పోలీస్ లేఅవుట్ వేలం: నాలుగు ప్లాట్ల విక్రయంతో హెచ్ఎండీఏకు ₹2708 కోట్లు — ప్రజలకు అందని రియల్ ఎస్టేట్ ధరలు?

తెలంగాణలో రియల్ ఎస్టేట్ ధరలు మరింతగా పెరుగుతున్న వేళ, నియో పోలీస్ లేఅవుట్‌లో జరిగిన తాజా వేలం రికార్డు స్థాయి మొత్తాలను నమోదు చేసింది. ఎకరానికి ₹151.25 కోట్ల ధర పలికిన ఈ వేలంలో, మరో ప్లాట్ ఎకరానికి ₹147.75 కోట్లకు అమ్ముడైంది. మొత్తం నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు ₹2708 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో మరిన్ని రెండు ప్లాట్లను వేలం వేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ భారీ ధరలు ప్రజల్లో…

Read More

సినిమా థియేటర్లలో అక్రమ పార్కింగ్ వసూళ్లు – ప్రజల్లో ఆగ్రహం

సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజుల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిబంధన ప్రకారం సినిమాహాళ్లలో పార్కింగ్ ఉచితమే అయినప్పటికీ, అనేక థియేటర్లు పబ్లిక్ నుండి డబ్బులు వసూలు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు యువజన సంఘాలు, కార్యకర్తలు ఒకే వేదికపైకి వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు మాట్లాడే ధైర్యం చేయకపోతే ఈ దోపిడీ వ్యవస్థ ఎప్పటికీ ఆగదని, అందరూ ముందుకు రావాలని వారు…

Read More