జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత విజయం – కేసీఆర్ పునరాగమనానికి మొదటి అడుగు: బిఆర్ఎస్ నేత

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఉత్సాహంగా స్పందించారు. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని పూడ్చేందుకు ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు.

పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు పేర్కొంటూ, “మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి పేదలకు, బలహీన వర్గాలకు విశేష సేవలు అందించారు. ఆయన స్థానంలో సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టడం కుటుంబానికి, ప్రజలకు అండగా నిలబడాలనే సంకల్పానికి నిదర్శనం” అన్నారు.

వారు మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నిక వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఇది 10 ఏళ్ల అభివృద్ధికి మరియు గత రెండేళ్ల అవినీతికి మధ్య జరుగుతున్న పోరు. రైతు బంధు పాలనకు వ్యతిరేకంగా రాబందు పాలనకు వ్యతిరేకంగా ఈ ఎన్నిక జరగబోతోంది,” అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చలేదని, మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇవ్వకపోవడం పట్ల ప్రజల్లో అసహనం నెలకొని ఉందని తెలిపారు. “మాగంటి సునీత గారి గెలుపుతో ప్రజలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ మోసాలకు ముగింపు వస్తుంది” అని నేతలు అన్నారు.

ఆటో కార్మికులు, దళితులు, బీసీలు, మైనారిటీలు – ప్రతి వర్గం మాగంటి సునీత గారిని గెలిపించేందుకు సిద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు. “హైదరాబాద్ బస్తీల్లో కేసీఆర్ ఇచ్చిన ఇళ్లు, పట్టాలు, ఉచిత నీటి పథకాలు ప్రజలకు గుర్తున్నాయి. అదే నమ్మకంతో మళ్ళీ కేసీఆర్ నేతృత్వం అవసరం” అని వ్యాఖ్యానించారు.

నాయకులు పేర్కొంటూ, “జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మాగంటి సునీత గెలుపుతో బిఆర్ఎస్ జైత్రయాత్రకు నాంది అవుతుంది. ఇది కేసీఆర్ పునరాగమనానికి తొలి మెట్టు” అన్నారు.

మొత్తం రాష్ట్రం మాగంటి సునీత గెలుపును తన గెలుపుగా భావిస్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *