తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ!

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చకుండా Absent, Shifted, Dead, Duplicate (ASDD) కేటగిరీల్లో గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇది సుమారు 21.70 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరో 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఓట్లు ఎందుకు…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పు? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదేనా!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు, కొండా సురేఖ వ్యవహారం, కొత్త వారికి మంత్రి పదవులపై ఆశలు.. వీటన్నింటి మధ్య మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “తెలంగాణ రాజకీయాల్లో మార్పు రాబోతుంది. ఆ మార్పులో నా పాత్ర చాలా కీలకం” అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు ఆయన చెప్పిన మార్పు ఏంటి? మంత్రివర్గంలో…

Read Full News

నాడు జీవన్ రెడ్డి.. నేడు చిన్నారెడ్డి! తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త పోరు ఎటు? అసంతృప్తి నేతలంతా ఒక్కటవుతున్నారా?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త నేతల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో నెలకొన్న పాత–కొత్త నేతల వివాదంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే జగిత్యాల నియోజకవర్గంలో మరోసారి అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవన్ రెడ్డి తనకు పార్టీలో తగిన గుర్తింపు, పదవి లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కాంగ్రెస్‌కు…

Read Full News

కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్వరాలు.. కళ్లెం వేసే నాయకుడు ఎవరు? పాత–కొత్త నేతల మధ్య ముదురుతున్న ఆధిపత్య పోరు

హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి క్రమంగా బహిర్గతమవుతున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌కు ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతల నుంచే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పదవులు దక్కలేదని కొందరు, పార్టీలో గుర్తింపు లేదని మరికొందరు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇంకొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాత–కొత్త నేతల మధ్య…

Read Full News

చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు.. మీడియా, ప్రతిపక్ష నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు?

హైదరాబాద్‌లోని చెన్నారెడ్డి టిమ్స్ (TIMS) హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మీడియా ప్రతినిధులను కూడా ఆసుపత్రి లోపలికి అనుమతించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునే అవకాశం ప్రతిపక్ష నాయకులకు, మీడియాకు ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే…

Read Full News

రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో బస్తీవాసుల అవస్థలు.. ఎన్నికల ముందు మాత్రమే నేతల హడావుడి!

హైదరాబాద్‌లోని ఓ బస్తీలో మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, నీటి నిల్వలు, మురుగు కాలువల సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల మాటల్లో చూస్తే.. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బస్తీల్లోకి వస్తారు.. ఆ తర్వాత తమ సమస్యలను పట్టించుకునే వారు కనిపించడం లేదనే అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదిన్నరైనా…

Read Full News

ఎర్రగడ్డలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. ప్రజల ఆగ్రహం: ఎన్నికల వేళ మళ్లీ హామీలేనా?

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రోడ్లు, డ్రైనేజీ, నీటి నిల్వలు, పార్కింగ్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు, ప్రజాప్రతినిధులు బస్తీల్లో తిరిగి హామీలు ఇస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే రోడ్లన్నీ జలమయం ఎర్రగడ్డ ప్రాంతంలోని కొన్ని బస్తీల్లో…

Read Full News

తెలంగాణలో జనసేనకు పెరుగుతున్న వలసలు.. ‘సినిమా పిచ్చి’ వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో జనసేన చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఇటీవల బీజేపీ నుంచి కొందరు నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు జనసేనలోకి వెళ్తున్న వారిపై ‘సినిమా పిచ్చితో వెళ్తున్నారు’ అన్నట్లుగా వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అయితే ఆ వైరల్ పోస్టులోని వ్యాఖ్యల పూర్తి సందర్భం స్పష్టంగా లేకపోవడంతో, ఈ వ్యాఖ్య నిజంగా ఏ సందర్భంలో…

Read Full News

ఎర్రగడ్డలో బస్తీ సమస్యలపై ఓకే టీవీ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ పథకాలపై భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్: నగరంలోని బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ‘బస్తీలలో కుస్తీ’ కార్యక్రమంలో భాగంగా ఓకే టీవీ బృందం ఎర్రగడ్డ డివిజన్‌లో పర్యటించింది. స్థానికులు, మున్సిపల్ సిబ్బంది, బస్తీవాసులతో మాట్లాడి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, రేషన్, ఇళ్ల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఎర్రగడ్డలో గతంలో ఉన్న కార్పొరేటర్ షీనా బేగం మృతి అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన…

Read Full News

ఉత్తమ్ వర్సెస్ రేవంత్.. రోజురోజుకీ ముదురుతున్న వివాదం? పార్టీ పదవులపై మరోసారి కోటాపోటి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం ప్రభుత్వ శాఖలు, అధికార వ్యవహారాల విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు వినిపించగా.. ఇప్పుడు పార్టీ పదవుల విషయంలోనూ పోటీ నెలకొన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన…

Read Full News