జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగుల స్వరం — ఆస్మా బేగం ధైర్యపోరాటం

హైదరాబాద్ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే, రాష్ట్రంలోని వేలాది నిరుద్యోగుల తరఫున పోటీ చేస్తూ ఆస్మా బేగం రంగంలోకి దిగారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టకపోవడంతో, “ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రతి నిరుద్యోగి తరఫున సాగుతున్న ఉద్యమం” అని ఆస్మా బేగం తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశాయి. ప్రతి సారి హామీలు ఇచ్చి…

Read Full News

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు — మైనంపల్లి హనుమంతరావు గారి ధైర్యవాక్యాలు

హైదరాబాద్, జూబ్లీహిల్స్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత హాట్‌సీట్‌గా మారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి చెలరేగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య గారు, జూబ్లీహిల్స్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడాలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేశారు. హనుమంతరావు గారు మాట్లాడుతూ,

Read Full News

సనత్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమగారి ప్రచారం — జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు

సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమగారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కోట నీలిమగారు మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజల పార్టీ. బీఆర్ఎస్‌లా ఇది కుటుంబ పార్టీ కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. మేము జవాబుదారీ…

Read Full News

కార్పొరేటర్ సంగీతగారి ఆత్మీయ ప్రచారం — అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ హడావిడి

అమీర్‌పేట్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ శ్రీనిలయ అపార్ట్‌మెంట్‌లో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ సంగీతగారు పాదయాత్ర నిర్వహించారు. ఈ అపార్ట్‌మెంట్‌లోకి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు కూడా రాలేదని అక్కడి నివాసితులు పేర్కొన్నారు. అయితే, ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునేందుకు సంగీతగారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లడం స్థానికులలో ఆనందాన్ని కలిగించింది. సంగీతగారు అక్కడి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న రోజువారీ ఇబ్బందులను తెలుసుకున్నారు. నీటి సరఫరా సమస్యలు, రోడ్లు దెబ్బతినడం, పార్కింగ్…

Read Full News

జూబ్లీ హిల్స్ బస్తీ పౌరుల ఆవేదన: వాగ్ధానాలు గాల్లోకెళ్ళి, కాలువ సమస్యలు–జీవితమే సవాలుగా మారింది

జూబ్లీ హిల్స్ పరిసర బస్తీలలో నివసించే ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాలువ సమస్య, రోడ్లలేమి, ప్రాథమిక వసతుల కొరత కారణంగా తమ జీవితం నరకంగా మారిందని వారు వాపోయారు. “మా కాలువ తొవ్వి వుంచేసి ఇలా నాశనం చేశారు. నీళ్ళు వెళ్లడానికి దారి లేదు. ఇళ్ళు కూల్చేశారు. పెద్దలు వస్తే ఒక్క గంటైనా మా దగ్గర కూర్చొని చూస్తారా?” అని ఒక మహిళ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా, పరిస్థితులు మాత్రం…

Read Full News

ఖైరతాబాద్‌లో పీజీఆర్ వారసత్వం — రాజకీయ సాంప్రదాయాలపై మళ్లీ చర్చ

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రముఖ నియోజకవర్గం ఖైరతాబాద్ ఎన్నాళ్లుగానో పేద ప్రజల ఆశలు–ఆకాంక్షలకు కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతానికి పునాది వేసి, పేదలకు అండగా నిలబడి, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన నేత పి. జనార్ధన రెడ్డి (పీజీఆర్). తండాలు, గూడాలు, మారుమూల బస్తీలు…హైదరాబాద్‌కు ఉద్యోగాల కోసం వచ్చిన వలస కుటుంబాలకు అండగా నిలిచిన పీజీఆర్, “పేదల దేవుడు”గా పేరుపొందారు. 2007లో పీజీఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందగా, ఖైరతాబాద్‌తో పాటు మొత్తం హైదరాబాదు…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బీఆర్‌ఎస్–బీజేపీపై రేవంత్ రెడ్డి ఆగ్రహపు ఫైరింగ్, అభివృద్ధి–సానుభూతి రాజకీయాలపై సవాల్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీలను కఠిన పదజాలంతో మందలించారు. ప్రజా సభలో మాట్లాడిన ఆయన, సెంటిమెంట్ కన్నా అభివృద్ధి ముఖ్యమని, జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ తమ నిర్ణయాన్ని సరైన దిశగా చూపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు బీఆర్‌ఎస్ ఒక మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని విమర్శించిన రేవంత్, “మహిళలు రాజ్యాన్ని నడపలేరా?” అని ప్రశ్నించారు….

Read Full News

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడి: రంగంలోకి అగ్రనేతలు, ప్రచారం ఉత్కంఠ

జూబిలీహిల్స్ ఉపఎన్నిక మరింత వేడెక్కింది. నేటి నుంచి ప్రధాన పార్టీల అగ్రనేతలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఓటర్ల మద్దతు సంపాదించేందుకు నాయకులు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి విస్తృత ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తూ, హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ, పార్టీకి మద్దతు కోరుతున్నారు….

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి: మైనారిటీ మంత్రివర్గంపై చర్చ – అజరుద్దీన్ ప్రమాణ స్వీకారంపై వివాదం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో మైనారిటీ ప్రతినిధిత్వం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో తీసుకోవడం పై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమ ఆరోపణల్లో, మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని, రెండు సంవత్సరాలుగా మైనారిటీకి మంత్రిపదవి ఇవ్వకపోయి, ఎన్నికల…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: బిఆర్ఎస్ పట్ల ప్రజల నమ్మకం ఇంకా బలంగానే ఉందా? – పావని గౌడ్ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాజకీయ వేడి పెరుగుతున్న క్రమంలో, అన్ని పార్టీలూ విస్తృత ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న పావని గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బిఆర్ఎస్ పట్ల విశ్వాసం ఇంకా బలంగానే ఉందని, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ప్రజానీకం గట్టి మద్దతు ఇస్తోందని ఆమె అన్నారు. గోపీనాథ్ లేని లోటు ఉన్నప్పటికీ, ఆయన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో…

Read Full News