Chandana R

మెట్రో స్టేషన్లలో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రశంసనీయం

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని నియమిస్తూ కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది ట్రాన్స్‌జెండర్లు సోమవారం అధికారికంగా విధుల్లో చేరారు. వీరు మెట్రో స్టేషన్లలో సెక్యూరిటీ, స్కానింగ్, స్ట్రీట్-లెవెల్ మరియు కాన్కోర్స్ ఏరియాల భద్రత నిర్వహించనున్నారు. రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులు మెట్రోలో…

Read More

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం: హైదరాబాద్ యువకుడిని 14.34 లక్షలు గుంజిన నెట్వర్క్

హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తిని రూ. 14.34 లక్షలు దోచుకున్నారు. కాచిగూడకు చెందిన యువకుడిని మొదట WhatsApp ద్వారా సంప్రదించిన నేరగాళ్లు, తాము “పైరసీ DMA ట్రేడింగ్ ప్రతినిధులు” అని చెప్పుకున్నారు. బాధితుడిని ప్రత్యేక గ్రూపులో చేర్చి పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. వారి నమ్మకాన్ని పొందేందుకు యాప్‌లో లాభాలు వచ్చినట్లుగా…

Read More

యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.“స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి…

Read More

ఏపీకి పరిశ్రమల తరలింపు కుట్రా? – హిల్ట్ పాలసీపై తెలంగాణలో ఆందోళన

తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీతో సుమారు 5,000 పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక నేతల కుట్ర ఉందని పరిశ్రమల వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణలోని పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న, మధ్య తరహా తయారీ యూనిట్లు కాలుష్య నియంత్రణ పేరుతో తరలించే నిర్ణయం పరిశ్రమల భవితవ్యాన్ని అనిశ్చితిలోకి…

Read More

ఏపీకి పరిశ్రమల తరలింపు కుట్రా? – హిల్ట్ పాలసీపై తెలంగాణలో ఆందోళన

తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీతో సుమారు 5,000 పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక నేతల కుట్ర ఉందని పరిశ్రమల వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణలోని పరిశ్రమల్లో 60% పైగా ఏపీ వాసుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న, మధ్య తరహా తయారీ యూనిట్లు కాలుష్య నియంత్రణ పేరుతో తరలించే నిర్ణయం పరిశ్రమల భవితవ్యాన్ని అనిశ్చితిలోకి…

Read More

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా లియోనెల్ మెస్సీ? – రేవంత్ నిర్ణయంపై రాజకీయ రగడ

తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని నియమించాలనే ఆలోచన అధికార వర్గాల్లో చర్చకు వచ్చింది. మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు ముంబై నగరాల్లో పర్యటించి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతారని ముందుగా ప్రణాళిక కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో అహ్మదాబాద్ బదులు హైదరాబాద్ పర్యటన చేర్చబడినట్లు సమాచారం. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఒక టీంకు మెస్సీ…

Read More

జిహెచ్ఎంసి వార్డుల విభజనలో భారీ మార్పులు – 300కు పైగా వార్డులే లక్ష్యం

జిహెచ్ఎంసిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగం పెంచింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పైగా పెంచే దిశగా ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, జిహెచ్ఎంసి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత మూడు రోజులుగా టౌన్ ప్లానింగ్ అధికారుల సమీక్షలు, డేటా ఆధారంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం 27 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసిలో విలీనం కానున్న నేపథ్యంలో మొత్తం పరిధి, జనాభా పరిమాణం గణనీయంగా పెరగనుంది. లక్ష్యంగా ప్రభుత్వం ఓటర్ల…

Read More

డిజిటల్ అరెస్టుల మోసాలపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు: సంచార్ సాధి డిఫాల్ట్ యాప్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్టుల పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తుండడంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మోసాలకు సంబంధించిన దర్యాప్తును **పాన్–ఇండియా స్థాయిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)**కి అప్పగించాలని ఆదేశించింది. 🔹 రిజర్వ్ బ్యాంకుపై ప్రశ్నలు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతాలను గుర్తించి స్తంభింపచేయడంలో ఎందుకు AI మరియు Machine Learning టెక్నాలజీలు ఉపయోగించడం లేదని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంకును ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు…

Read More

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం: కాంగ్రెస్ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ వేడి

ఖమ్మంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నూతి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేతల వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయడం తమ బాధ్యత అని అన్నారు. ఎవరు గెలిచినా కాంగ్రెస్‌కే వస్తారు”…

Read More

బీసీ ఉద్యమం మధ్య రేవంత్ పర్యటన.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిష్ట పోసుకున్న కాంగ్రెస్!

నిన్న నారాయణపేట, మక్తల్ ప్రాంతాల్లో జరిగిన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక వైపు బీసీ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండగా, మరోవైపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వమే బరిలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, “మంత్రులతో తిరిగి పనులు చేయించే వారినే గెలిపించండి. కాళ్లలో కట్టెలు పెట్టి అభివృద్ధి ఆపే వారికి ఓటేయొద్దు” అని ప్రజలను హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో సరైన…

Read More