News
హైకోర్టుకు చేరిన సంక్రాంతి బిగ్గీస్.. కారణమేంటంటే..?
సంక్రాంతి 2026 సీజన్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు పోటీ పడనున్నాయి. ఈ పండుగ సీజన్కు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రాలు తెలంగాణ హైకోర్టు వరకు చేరడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ…
కొత్త ఉపాధి హామి బిల్లుతో గ్రామీణాభివృద్ధి దిశగా అడుగు.. కాంగ్రెస్ వ్యతిరేకతపై రాజకీయ వేడి
పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ముగియగా, త్వరలో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, పథకాలు ఆమోదం పొందాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనదిగా కొత్త ఉపాధి హామి బిల్ నిలుస్తోంది. ఈ బిల్ ద్వారా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక లాభం చేకూరుతుందని పాలక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి హామి భావన కొత్తది కాదని, బ్రిటిష్ కాలం నుంచే వివిధ రూపాల్లో అమలులో ఉందని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కరువు కాలంలో…
రాహుల్ గాంధీ – రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. దిగజారుతున్న రాజకీయ భాషపై తీవ్ర విమర్శలు
తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత దిగజారుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణపైకి “వదిలాడ”ని వ్యాఖ్యానించిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ అశోక్ నగర్ సభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని…
తెలంగాణ అస్తిత్వం పేరుతో కవిత కొత్త పార్టీ.. ప్రజలు నమ్ముతారా? అనుమానాల మధ్య రాజకీయ ప్రయాణం
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటూ.. సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితకు ఆమోదం కూడా లభించినట్టు సమాచారం. బంజారాహిల్స్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణ, ప్రజా సమస్యల గుర్తింపు, పరిష్కార దిశగా కమిటీల ఏర్పాటు…
అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?
ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే…
కవిత కాంగ్రెస్లోకి వెళ్తే ఆశ్చర్యం లేదు..! మంత్రి పదవి రాకపోతే పార్టీకే నష్టం: మాల్రెడ్డి రంగారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆశ్చర్యం ఏమీ లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన మాల్రెడ్డి రంగారెడ్డి.. “కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వస్తారని మేము అనుకున్నామా?…
బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!
బన్నీ బ్రాండ్.. స్టెప్ బై స్టెప్ ఎదగడమంటే ఇదేనేమో!ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు కేవలం నేమ్ కాదు.. ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన తన స్టార్ ఇమేజ్ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు పెంచుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ తన కెరీర్ ను నిర్మించుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారారని చెప్పాలి….
అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై విశ్లేషణ
అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై రాజకీయ విశ్లేషణ తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలు ఈసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర, ముఖ్యంగా బీఆర్ఎస్ వైఖరి రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్లో “ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తా” అనే వ్యాఖ్యలు…
అదే నిజమైన హీరోయిన్’.. అనసూయ కొత్త పోస్ట్ ఎవరికోసం?
‘అదే నిజమైన హీరోయిన్’.. అనసూయ కొత్త పోస్ట్ ఎవరికోసం?యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. అదే సమయంలో పలు విషయాలపై కూడా రెస్పాండ్ అవుతుంటారు. రీసెంట్ గా నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించి హాట్ టాపిక్ గా మారారు. అనేక మంది అనసూయకు మద్దతు తెలిపారు. కొందరు మాత్రం.. ఓ షో లో ఆమె చేసిన డబుల్ మీనింగ్ తో…
పైరసీ భూతంపై టాలీవుడ్ సంచలన నిర్ణయం.. కనీసం ఇప్పటికైనా?
పైరసీ భూతంపై టాలీవుడ్ సంచలన నిర్ణయం.. కనీసం ఇప్పటికైనా?పైరసీ.. టాలీవుడ్ సినీ పరిశ్రమకు అతిపెద్ద భూతంగా మారింది. సుమారుగా కొన్ని సంవత్సరాలలోనే వేలకోట్ల నష్టాన్ని మిగిల్చిన ఈ పైరసీ దుండగులు సినీ పరిశ్రమను పూర్తిస్థాయిలో నష్టాల్లో ముంచేస్తున్నారు అనడంలో సందేహం లేదు. అయితే ఈ పైరసీని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కంకణం కట్టుకున్నా.. ఎప్పటికప్పుడు కొత్త పైరసీ యాప్ లు పుట్టుకొస్తూ అధికారులకు తలనొప్పిగా మారాయి. అయితే ఈ పైరసీ భూతాన్ని తరిమికొట్టడానికి టాలీవుడ్ సినీ…

