సర్పంచ్ ఎన్నికల్లో హస్తం హవా: ఉత్కంఠ ఫలితాలు, ఒక్క ఓటుతో గెలుపులు, బీఆర్ఎస్ వెనుకంజ

తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఒక్క ఓటు తేడాతో గెలుపులు, కుటుంబ సభ్యుల మధ్యే పోటీలు, ఓటమిని తట్టుకోలేక గుండుపోటుతో అభ్యర్థుల మృతి వంటి విషాద ఘటనలు ఈ ఎన్నికలకు ప్రత్యేకతగా నిలిచాయి. మృతి చెందిన అభ్యర్థి చివరికి గెలుపొందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి ఓడిపోవడం వంటి ఘటనలు గ్రామ రాజకీయాల్లో పోటీ ఎంత తీవ్రంగా…

Read More

తారక్ – చరణ్ రంగంలోకి ఒకేసారి! రామోజీ ఫిలిం సిటీలో సందడి… ‘పెద్ది’, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ షూటింగ్స్ రీస్టార్ట్

టాలీవుడ్ బిగ్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకేసారి రంగంలోకి దిగారు. నిన్నటి వరకు రెస్ట్ మోడ్‌లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు తిరిగి షూటింగ్స్ మొదలుపెట్టడంతో టాలీవుడ్‌లో హడావుడి మొదలైంది. చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, తారక్ నటిస్తున్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కొత్త సినిమా… ఈ రెండు చిత్రాలకు ఇటీవల షూటింగ్ బ్రేక్ పడటంతో నెట్టింట పెద్దగా చర్చ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ రెండు సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ రామోజీ ఫిలిం…

Read More

13 ఏళ్ల తర్వాత కూడా తగ్గని జోరు: హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్‌తో ఫ్యాన్స్‌కు పండగ

ఒక రాయి అందమైన శిల్పంగా మారాలంటే సరైన శిల్పి చేతిలో పడాలి… అలాగే ఒక నటుడు సూపర్ స్టార్‌గా ఎదగాలంటే సరైన దర్శకుడి కాంబినేషన్ కుదరాలి. అలాంటి మ్యాజికల్ కాంబినేషన్లు తెరపైకి వచ్చినప్పుడే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతాయి. అలాంటి అరుదైన సూపర్ హిట్ కాంబినేషన్‌లలో ఒకటి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్. 2012లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా అప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, బాక్సాఫీస్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది….

Read More

ఫుట్‌బాల్‌పై కోట్లు… రైతు బంధు, ఉద్యోగాలపై మౌనం: గుంపు మేస్త్రి పాలనపై పావని గౌడ్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు పెరుగుతున్న వేళ, పావని గౌడ్ తీవ్ర వ్యాఖ్యలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఫుట్‌బాల్ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏంటి అని ఆమె నిలదీశారు. రైతు బంధుకు నిధులు లేవని, గురుకులాల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, కానీ ఫుట్‌బాల్ కోసం మాత్రం…

Read More

గ్రామ పంచాయతీ ఎన్నికలు: తొలి విడత ఫలితాలతో అలర్ట్ అయిన కాంగ్రెస్, రెండో విడతపై ఫోకస్ – బిఆర్ఎస్ కౌంటర్ వ్యూహాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ముగియడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొదటి విడత ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మెజారిటీ గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నప్పటికీ, బిఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తొలి విడతలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ స్వగ్రామాల్లోనే సర్పంచ్ స్థానాలను గెలిపించుకోలేకపోవడం పార్టీకి హెచ్చరికగా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, పార్టీ…

Read More

2027 జనగణనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం: కులగణన, 11,718 కోట్లు ఖర్చు – బీసీ రిజర్వేషన్లపై రాజకీయ దుమారం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2027 జనగణనకు అధికారిక ఆమోదం తెలిపింది. ఈ జనగణనకు సంబంధించి రూ.11,718.24 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెండు దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణనను కూడా తొలిసారి చేపట్టనున్నారు. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచే ప్రతిపాదన, బీమా రంగంలో 100 శాతం…

Read More

మోయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో అనుమతి లేని బర్త్‌డే పార్టీ: విదేశీ మద్యం, హుక్కాతో వేడుకలు – ఎస్వా పోలీసుల దాడి, కేసులు నమోదు

హైదరాబాద్ శివార్లలో మరోసారి అనుమతి లేని ఫార్మ్ హౌస్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్‌లో అర్ధరాత్రి నిర్వహించిన బర్త్‌డే పార్టీని ఎస్వా (Excise) పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పరికరాలతో వేడుకలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించి…

Read More

క్యూ న్యూస్ ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచారి మృతి: తీన్మార్ మల్లన్న పాత్రపై అనుమానాలు – హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు డిజిటల్ మీడియా ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల తీవ్ర విమర్శలు డిసెంబర్ 4 ఘటనపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంచలన ఆరోపణలు డిసెంబర్ 4న సాయి ఈశ్వర్ చారి అనే యువకుడు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TDMA) స్పష్టం చేసింది. అనుమానాలే కేంద్రబిందువు ఈ ఘటనకు సంబంధించి తీన్మార్ మల్లన్న…

Read More

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల ఆగ్రహం: బీసీ నినాదాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుతున్నారు

తీన్మార్ మల్లన్నపై మీడియా వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు మండిపడ్డారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మీడియా మిత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ, చిలుక ప్రవీణ్‌తో పాటు పలు మీడియా సంస్థలు, ముఖ్యంగా ఓకే టీవీ సహా కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు….

Read More

టాస్ మాత్రమే వేశాను.. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది: కాంగ్రెస్, బీజేపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టేలా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంతకాలం బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందనే ఊరుకున్నా. ఇప్పటివరకు టాస్ మాత్రమే వేశాను. అసలైన టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తానని…

Read More