News
మేడారంలో చరిత్రాత్మక క్యాబినెట్ భేటీ: 18న మంత్రివర్గ సమావేశం, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు?
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్కు దూరంగా, ములుగు జిల్లా మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర ప్రాంతంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వ ఆమోదం తెలిపే అవకాశం ఉందని…
ఆలయాల వద్ద భద్రతపై ఆందోళన… ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇటీవల కొన్ని ఆలయాల పరిసరాల్లో చోటు చేసుకున్న ఘటనలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఆలయాల పవిత్రతను కాపాడటం, ప్రజల భావోద్వేగాలను గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ముఖ్య బాధ్యతగా పలువురు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత ఘటనల్లో నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఎటువంటి మినహాయింపులు లేకుండా విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. “మానసిక ఆరోగ్యం” వంటి కారణాలతో కేసులు సడలించకుండా, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆలయాల వద్ద భద్రతను బలోపేతం చేయాలని, సీసీటీవీ…
సెక్రెటేరియట్లోనే సస్పెన్స్ థ్రిల్లర్.. సినిమా టికెట్ రేట్ల వెనుక కనిపించని శక్తి ఎవరు? – హరీష్ రావు ఫైర్
రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు విడుదలవుతుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఈ…
యువతకు దిశానిర్దేశం.. స్వామి వివేకానంద బోధనలు
జనవరి 12 వస్తే దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనుల దినోత్సవం (National Youth Day) అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ సందర్భంలో మనం కేవలం కార్యక్రమాలు, ఉపన్యాసాలు, ఫోటోలకు మాత్రమే పరిమితమవుతున్నామా? లేక నిజంగా వివేకానంద ఆలోచనలను యువత జీవితంలోకి తీసుకెళ్తున్నామా? అనే ప్రశ్న మన ముందుంది. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న విశ్వాసాన్ని బలంగా వ్యక్తపరిచిన ఆలోచనావేత్త స్వామి వివేకానంద. ఆయన యువతను కేవలం ఉద్యోగ సాధన యంత్రాలుగా చూడలేదు….
చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు.. నిషేధిత మాంజాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు
చైనా మాంజాతో చెలగాటం ప్రాణాలకు ప్రమాదమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా కత్తికన్నా పదునుగా, సీసం కన్నా లోతుగా శరీర భాగాలను కోసేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా బైక్పై వెళ్లే వాహనదారులకు ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఇటీవల ఉప్పల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ నెలలోనే చైనా…
సెక్రెటేరియట్లోనే సస్పెన్స్ థ్రిల్లర్.. సినిమా టికెట్ రేట్ల వెనుక కనిపించని శక్తి ఎవరు? – హరీష్ రావు ఫైర్
రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు విడుదలవుతుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఈ…
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ…
రేవంత్ రెడ్డికి గెలుపా..? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలిపోతుంది: బీఆర్ఎస్ ఫైర్
రేవంత్ రెడ్డి నిజంగా గెలవాలనుకుంటున్నారా? లేక మాటలకే పరిమితమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రజల తీర్పు ఏమిటో స్పష్టంగా చెప్పబోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు జీహెచ్ఎంసీపై తమకే విజయం ఖాయమంటూ చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. “సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 60 శాతం వచ్చినా, మాకు 40 శాతం వచ్చింది. బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు….
గాలిలో పతంగుల జోరు… చైనా మాంజాతో ప్రాణాలు బేజారు
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి గల్లీలో పిల్లలు పతంగులు ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలతో ఆడుకుంటూ ఆనందంగా గడపడం పండుగకు ప్రత్యేక ఆకర్షణ. కానీ ఆ సరదానే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పతంగులను తెంచేయాలనే ఉద్దేశంతో హానికారక రసాయన రంగులతో తయారు చేసిన ‘చైనా మాంజా’ వినియోగం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ చైనా మాంజా తాకిన పక్షులు గాల్లోనే చనిపోతుండగా, మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. వాహనదారుల మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలకు కారణమవుతుండటంతో…
చలికాలంలో మార్నింగ్ వాకింగ్.. మీ గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే!
చలి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శీతాకాలంలో మార్నింగ్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. కానీ చలికాలంలో ఉదయపు నడక గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే సమయంలో శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. దీని వల్ల రక్తపోటు పెరిగి గుండెపై అదనపు ఒత్తిడి…

