News
నగరానికి సంక్రాంతి శోభ.. పల్లెబాట పట్టిన పట్టణం
నగరానికి సంక్రాంతి శోభ వచ్చేసింది. పండుగ సెలవులు సమీపించడంతో పట్టణం నుంచి పల్లెలకు జనస్రవంతి బయలుదేరింది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో నగరవాసులు పెద్ద ఎత్తున స్వగ్రామాల బాట పట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం క్రమంగా ఖాళీ అవుతుండగా, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ రోజు నగరవ్యాప్తంగా పాఠశాలల్లో ముందస్తుగా సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రేపటి నుంచి సెలవులు కావడంతో ఈ సాయంత్రమే…
ఆ హీరోయిన్కు కేటీఆర్ వంద కోట్లు ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ (పీసీపీ) నాయకుడు గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. గజ్జెల కాంతం మాట్లాడుతూ, 2022 జనవరి 24న ఓ కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని ఖాతాల నుంచి ఓ హీరోయిన్కు కేటీఆర్ రూ.100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఆ డబ్బు మూలం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని…
సినిమా టికెట్ల వివాదంపై సీఎం భేటీకి నిర్మాతలు.. నీటి వివాదాలపై ‘వివాదాలు కాదు.. నీళ్లే కావాలి’ అని రేవంత్ రెడ్డి స్పష్టం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ల ధరల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై విధించిన పరిమితులను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రధానంగా ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుకు అనుమతి లభించకపోవడం, అలాగే జీఓ…
డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. నియామకం రద్దు పిటిషన్ కొట్టివేత
రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది. అయితే రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు యూపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. డీజీపీ…
సంక్రాంతి రద్దీ వేళ రవాణా శాఖ దూకుడు.. 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన రవాణా శాఖ అధికారులు తనికీలను ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా తదితర రాష్ట్రాలకు నడిచే స్లీపర్ బస్సులపై మూడు రోజుల పాటు ప్రత్యేక తనికీలు నిర్వహించారు. ఈ నెల 7, 8 తేదీల్లో చేపట్టిన తనికీల్లో మొత్తం 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. సరుకు…
రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. జీవో 120పై పునఃసమీక్ష కోరిన ధర్మాసనం
ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ రావు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపుపై ఇకపై ఎలాంటి మెమోలు జారీ చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది….
డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్కు భారీ ఊరట.. కేసును కొట్టివేసిన హైకోర్టు
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. గుడిమల్కాపూర్లో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్ను నిందితుడిగా చేర్చడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నవదీప్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ వెంకట్ సిద్ధార్థ్.. నటుడి వద్ద ఎలాంటి డ్రగ్స్ కూడా లభించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పాట్లో జరిగిన తనిఖీల్లోనూ నవదీప్ వద్ద నిషేధిత పదార్థాలు ఏవీ దొరకలేదని వివరించారు. అయితే,…
రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…
యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్ను.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ప్రభుత్వ వ్యవహారం: కేటీఆర్ తీవ్ర విమర్శలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ను తలపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీల అభివృద్ధి కంటే భూములు లాక్కోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని మండిపడ్డారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్నేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రెండున్నరేళ్లలో మారిపోతుందని, ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ విస్తరణకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే…
నిరుద్యోగుల అరెస్టులు కుట్ర కాదంటున్న కాంగ్రెస్.. ఉద్యోగాలపై చరణ్ కౌశిక్ క్లారిటీ
తెలంగాణలో నిరుద్యోగుల అంశం మరోసారి రాజకీయ వేడెక్కుతోంది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్లెక్కి ఆందోళనలు చేపడుతుండగా, పోలీసులు అరెస్టులు చేస్తూ కట్టడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కేనని, అయితే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యక్రమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడితే అరెస్టులు జరగడం సహజ ప్రక్రియేనని…

