జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో, కాంగ్రెస్ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాలుగా మైనారిటీకి క్యాబినెట్లో చోటు ఇవ్వకుండా, ఇప్పుడు అజరుద్దీన్ను మంత్రి పదవికి తీసుకోవడం ఎన్నికల స్ట్రాటజీ అనే అభిప్రాయం బలపడుతోంది.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 80 వేల ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరి మద్దతు గెలుపు–ఓటములను నిర్ణయించేంత కీలకం. విపక్షాలు కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ను ఎటాక్ చేస్తూ, “మైనారిటీలకు స్థానమే లేదు” అని విమర్శలు చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం సరిగ్గా ఉందా? ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందిస్తుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. “ఎన్నికల సమయంలో మంత్రి పదవులు ఇవ్వడం రూల్స్కి వ్యతిరేకం” అని పలువురు విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ శిబిరంలోనూ అసంతృప్తి వ్యక్తమవుతుంది. కార్యకర్తలు, స్థానిక నాయకత్వం ఫీల్డ్లో తగిన ఫండ్స్, సహకారం అందడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ ప్రచారంలో సైలెంట్గా వ్యవహరిస్తోందని, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కూడా ప్రస్తుత స్ట్రాటజీలో ఓ కీలక అంశంగా మారింది.
ప్రచారం ఉత్కంఠభరితంగా సాగుతోంది. అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రచారంలో పాల్గొననున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేపట్టనున్నారు. ఈ నిర్ణయం కాంగ్రెస్కి లాభమా నష్టమా అనేది 14వ తేదీ తర్వాత తెలుస్తుంది.
ఇక ప్రజలు కూడా ఆలోచనలో పడుతున్నారు —
“ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు?”
అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఎన్నికల ఫలితం కేవలం ఓ నియోజకవర్గం విజయం మాత్రమే కాదు —
మైనారిటీ రాజకీయాల్లో తెలంగాణలో కొత్త దిశ చూపే ఎన్నిక కూడా కావొచ్చు.

