మడావి హిడ్మా ఎన్కౌంటర్ చుట్టూ వివాదం: ఎన్‌కౌంటర్ల ధర్మసంకటంపై కొత్త రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలలో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా మరోసారి మావోయిజం, భద్రతా వ్యవస్థ, ఎన్‌కౌంటర్ల న్యాయబద్ధతపై తీవ్ర చర్చను ప్రారంభించింది. గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్ర నేత మడావి హిడ్మా, అతని భార్య రాజే, అలాగే మరో నలుగురు మావోయిస్టులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. హిడ్మాపై కోటిన్నర, రాజేపై 50 లక్షల రివార్డు ఉండటం ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను చూపిస్తుంది.

డీఎస్పీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, “ఇది కీలక విజయం” అని పేర్కొన్నప్పటికీ, ప్రతిపక్షాలు ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా, కేంద్ర హోం శాఖ గతంలోనే మావోయిస్టులకు లొంగిపోయే గడువు విధించిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ ముందుగానే జరగడం వివాదంగా మారింది.

ఒక వర్గం విమర్శిస్తూ,

  • లొంగిపోయే అవకాశం ఇచ్చామని,
  • అయినా కూడా ఒకేసారి హతమార్చడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తోంది.
  • మరోవైపు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అక్టోబర్ 26న AOB ప్రాంతంలో హిడ్మా టీమ్ పెద్ద సంఖ్యలో చలనం చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. అదే ఆధారంగా నాలుగు ప్రాంతాలలో 60 మంది మావోయిస్టులు ఉన్నారని గుర్తించి ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
  • ఇదిలా ఉండగా, మరో 50 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సమాచారం. దేవ్జీ అనే కీలక వ్యక్తి సెక్యూరిటీ బృందంలోని 9 మంది సహా అనేక మందిని విజ‍యవాడ ఆటోనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేవ్జీ ఎక్కడ అరెస్టై ఉన్నాడన్న దానిపై అధికారిక నిర్ధారణ మాత్రం ఇంకా రాలేదు.
  • ఎన్‌కౌంటర్లపై ప్రశ్నలు – భద్రతా వ్యవస్థ vs రాజకీయ వ్యవస్థ
  • రాజకీయ నేతలు, ప్రజల ఒక వర్గం ఇలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు:
  • మావోయిస్టులు చట్టవిరుద్ధం చేస్తే ఎన్‌కౌంటర్ జరుగుతుంది…
    అయితే పెద్ద ఎత్తున అవినీతి, దోపిడీలు చేసే రాజకీయ నాయకులంటే ఎలాంటి చర్య లేదు?
  • మావోయిజం పుట్టుకపోవడానికి కారణం ప్రభుత్వాల వైఫల్యమా?
  • ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, అవినీతిని అరికట్టడంలో వైఫల్యం…
    ఇవే నక్సలిజం పెరుగడానికి బీజం వేశాయా?
  • మావోయిజం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినా, ఒకప్పుడు ఈ గ్రూపులు సామాన్య ప్రజలకు అండగా ఉండేవారని కొందరు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం కఠినంగా స్పందిస్తూ,
  • “మావోయిజం దేశవ్యతిరేకం… పూర్తి నిర్మూలన తప్ప మరో మార్గం లేదు”
  • అంటున్నారు.
  • ప్రజల్లో పెరుగుతున్న అనిశ్చితి
  • ప్రజలలో ఒక వర్గం ఇలా ఆవేదన వ్యక్తం చేస్తోంది:
  • “ఒకప్పుడు న్యాయం కోసం పోరాడిన వాళ్లు…
    ఇప్పుడు నేర సంస్థలా మారిపోయారు.”
  • “అవినీతిపరులు, దోపిడీ చేసే రాజకీయ నాయకులపై మాత్రం ఎలాంటి శిక్షలు లేవా?”
  • “ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా విఫలమైతేనే మావోయిజం పుడుతుంది…
    దానికి మూలకారణం కూడా రాజకీయ వ్యవస్థే.”
  • ఈ వ్యాఖ్యలు మావోయిజం–ఎన్‌కౌంటర్లు–రాజకీయ అవినీతి అనే మూడు కోణాల చుట్టూ దేశంలో కొనసాగుతున్న పెద్ద చర్చను ప్రతిబింబిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *