తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించిన నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను ఘాటుగా విమర్శించారు. “రైజింగ్ తెలంగాణ అంటే ఇది కాదు రా నాయనా!” అంటూ ప్రారంభమైన ప్రసంగం, ప్రజల నిత్యజీవిత సమస్యల మీద దృష్టి సారించింది.
నేత మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన హామీలను గుర్తు చేశారు. “బీఆర్ఎస్ కాలంలో ప్రతి గల్లీకి బెల్ట్ షాప్ పెట్టారని, వాటిని నిర్మూలిస్తానని చెప్పిన నువ్వు, ఇప్పుడు ప్రజల ఇళ్లను బుల్డోజ్ చేస్తున్నావు. బెల్ట్ షాపులు కాదు, బతుకులే బుల్డోజ్ అవుతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అతను వ్యంగ్యంగా మాట్లాడుతూ — “రైజింగ్ తెలంగాణ అంటే మందులో, కాంట్రాక్టుల్లో కాదు, ప్రజల బతుకుల్లో రైజ్ కావాలి. కానీ మీరు మాత్రం దాన్ని వేరే దిశలో తీసుకెళ్తున్నారు” అన్నారు.
ఇంకా, రేవంత్ రెడ్డి పాలన గురించి నిజమైన ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే, “మారువేషంలో వెళ్లి ప్రజల మధ్య అడుగు. రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రజల మధ్యకు వెళ్లి వారి బాధలు విన్నాడు. నువ్వూ అలాగే చేయి” అని సూచించారు.
అలాగే, పాలనలో ఉన్న అవినీతి, అహంకారం, కూటమి రాజకీయాలపై కూడా కఠిన వ్యాఖ్యలు చేశారు. “పవర్ అనే మత్తు కళ్ళకు పైత్యం తెస్తుంది. అదే ఇప్పుడు నీ పాలనలో కనబడుతోంది. నీ చుట్టూ ఉన్న వారంతా నీ పేరుతో సంపాదిస్తున్నారు” అని ఆయన అన్నారు.
ప్రజల సమస్యలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, పేదల ఇళ్లు, ఉద్యోగుల జీతాలు, బెల్ట్ షాపులు వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“రాజ్యాంగం కప్పు వేసుకొని బతుకులను తొక్కవద్దు. నిజంగా ప్రజల గళం వినాలంటే, ఆ గల్లీల్లోకే వెళ్ళి విని రా రేవంత్” అని హితవు పలికారు.

