రాజస్థాన్‌లో ఎస్డీఎం చెంపపై కొట్టడంతో పెట్రోల్ బంక్‌లో ఘర్షణ

రాజస్థాన్‌లోని బిల్వారాలో ఎస్డీఎం మరియు పెట్రోల్ బంక్ సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రతాప్‌గడ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చోటు లాల్ శర్మ జశ్వంత్‌పుర ప్రాంతంలోని పెట్రోల్ బంక్ వద్ద తన కారుకు ముందుగా ఇంధనం నింపలేదని ఆగ్రహించి, ఒక సిబ్బందిని చెంపపై కొట్టాడు. దీనితో పెట్రోల్ బంక్ ఉద్యోగులు కూడా ప్రతిస్పందించి ఆయనపై చేయి చేశారు.

ఈ ఘటనపై ఎస్డీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంక్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. పోలీసులు దీపక్ మాళి, ప్రభు లాల్ కుమావత్, రాజ శర్మ అనే ముగ్గురు సిబ్బందిని అరెస్ట్ చేశారు.

అయితే, ఎస్డీఎం ఉద్యోగిని చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, కేవలం బంక్ సిబ్బందిని అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *