ఫోన్ టాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన కేసీఆర్, నందీనగర్లో కీలక భేటీలు
ఫోన్ టాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండటంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులు, సిట్ విచారణ తీరు, భవిష్యత్ వ్యూహాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం. సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు…

