ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి: ఆటో డ్రైవర్ల ఆగ్రహ దీక్ష – 15 రోజుల్లో చర్యలు లేకపోతే అసెంబ్లీ ముట్టడి”
హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆఫీసులు, అధికారులను కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “2012 తర్వాత ఇప్పటివరకు ఆటో మీటర్ రేట్లు పెరగలేదు. పెట్రోల్, రోడ్డు టాక్స్, జరిమానాలు అన్ని పెరిగాయి కానీ మా ఆదాయం పెరగలేదు. బస్సులకు, ఇతర సేవలకు ధరలు పెంచి ఆటో డ్రైవర్ల సమస్యలను…

