సినిమా టికెట్ల వివాదంపై సీఎం భేటీకి నిర్మాతలు.. నీటి వివాదాలపై ‘వివాదాలు కాదు.. నీళ్లే కావాలి’ అని రేవంత్ రెడ్డి స్పష్టం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ల ధరల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై విధించిన పరిమితులను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రధానంగా ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుకు అనుమతి లభించకపోవడం, అలాగే జీఓ…

