మా ఇల్లు కూల్చి రోడ్డున పెట్టారు”: ఖమ్మం భూదాన భూమి బాధితుల ఆవేదన

ఖమ్మం నగరంలో భూదాన భూముల వివాదం తీవ్రంగా మారింది. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలు తమ ఇళ్లు కూల్చివేయడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. “మా ఇల్లు కూల్చి మమ్మల్ని రోడ్డుపైకి తీసుకొచ్చారు” అంటూ బాధితులు తమ కష్టాలను వెల్లడిస్తున్నారు. బాధితుల ప్రకారం, అధికారులు తెల్లవారుజామునే భారీగా పోలీసులు, జేసీబీలతో వచ్చి ఇళ్లను కూల్చివేశారని చెబుతున్నారు. “ఉదయం నాలుగు గంటలకే వచ్చి బయటికి రండి అన్నారు. మేము బట్టలు, బియ్యం తీసుకునేలోపే మా ఇళ్లను కూల్చేశారు” అని…

Read More

ఖమ్మంలో భూదాన భూముల వివాదం: బాధితులకు పట్టాలు పంపిణీ, ఖాళీ చేసిన భూములపై కొత్త ప్రశ్నలు

ఖమ్మం నగరంలో భూదాన భూములపై నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూదాన భూముల్లో నివాసాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 412 మంది భూ బాధితులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు పాల్గొని బాధితులకు పట్టాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం, ఈ 412 కుటుంబాల్లో 311 మందికి స్థలంతో పాటు ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నారు. మరో 101…

Read More

ఖమ్మం భూదాన్ భూముల బుల్డోజింగ్ వివాదం – హైవే నెపంతో 1000 కుటుంబాల నిరాశ్రయత్వం?

ఖమ్మం భూదాన్ భూముల వివాదం – హైవే నెపంతో 1000 కుటుంబాల నిరాశ్రయత్వం? ఖమ్మంలో 33 ఎకరాల భూదాన్ భూములపై కొనసాగుతున్న వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న సుమారు 1000 కుటుంబాలు అకస్మాత్తుగా బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడంతో రోడ్డున పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూదాన్ భూముల నేపథ్యం ఈ భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో పేద కుటుంబాలకు కేటాయించబడిన భూదాన్ భూములని బాధితులు చెబుతున్నారు. విద్యుత్ సౌకర్యం…

Read More