సైదాబాద్ జువెనైల్ హోమ్లో దారుణం – పర్యవేక్షకుడి లైంగిక దాడికి గురైన చిన్నారులు
హైదరాబాద్ సైదాబాద్ జువెనైల్ చిల్డ్రన్ హోమ్లో షాక్కు గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తి నాలుగు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. చిన్నారులను రక్షించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తే వారిపై ఈ దారుణానికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, 2020–22 నుంచి జువెనైల్ హోమ్లో అవుట్సోర్సింగ్ ద్వారా ఎంపికైన అబ్దుల్ రెహ్మాన్, అక్కడ పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలలుగా అతను హోమ్లోని బాలురపై…

