ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు.. అయితే ఓట్లు ఎందుకు వేయాలి?: జమ్మికుంటలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి ఘాటు ప్రసంగం
జమ్మికుంట పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు అమలుకాలేదని, అలాంటప్పుడు ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. “మీరే చెప్తున్నారు—500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రాలేదు, మహిళలకు 2500 రూపాయలు రాలేదు, రైతు భరోసా రాలేదు. మరి చెప్పండి… ఓట్లు ఎందుకు వేయాలి?” అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న…

