డ్రైవింగ్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్: వికారాబాద్ పోలీసుల అవగాహన కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, బైక్ డ్రైవర్లు సహా అన్ని రకాల వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, ఆటోలలో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వివరించారు. ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల…

Read More

ట్రాఫిక్ చలాన్లపై ఇక డిస్కౌంట్లు లేవు: నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచే వసూలు చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఇకపై ఎలాంటి రాయితీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వకూడదని, చలాన్లు పడిన వెంటనే వాహన యజమానుల బ్యాంక్ ఖాతాల నుంచే నేరుగా జరిమానా మొత్తాన్ని వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ కీలక…

Read More

న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…

Read More