ఆడంబర రాజకీయాలు వద్దు… నిజాయితీకి ఓటేయండి: కామారెడ్డి ప్రజలకు రమణ రెడ్డి పిలుపు
కామారెడ్డి ప్రజలు విజ్ఞులని, ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేసినా తనను గెలిపించిన ప్రజల తీర్పు ప్రత్యేకమని రమణ రెడ్డి అన్నారు. తాను గెలిచే ముందు ఎలా సాధారణంగా వచ్చానో, గెలిచిన తర్వాత కూడా అలాగే సాధారణ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు. భారీ కాన్వాయ్లు, ఫ్లెక్సీలు, ఆడంబర కార్యక్రమాలు పెట్టుకోవడం నాయకత్వానికి గుర్తు కాదని స్పష్టం చేశారు. ప్రజల డబ్బుతో ప్రదర్శనలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని విమర్శించారు. పెద్ద ఎత్తున వాహనాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి ఖర్చు చేసే…

