ఫైనాన్స్ శాఖలో విక్రమార్క వైఫల్యం? జీతాలు నిలిచిపోవడంతో రేవంత్ ఆగ్రహం
ఫైనాన్స్ శాఖపై సీఎం రేవంత్ ఆగ్రహం: అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎక్కడ నిలిచిపోయాయి? తెలంగాణలో ఆర్థిక శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు–ఏడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటెలిజెన్స్, ఉద్యోగ సంఘాలు నివేదించడంతో సీఎం ఆర్థిక శాఖపై చురుకులు పెట్టినట్టు సమాచారం. గతంలో గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలతో…

