ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు సిట్ నోటీసులు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును సుమారు ఏడు గంటల పాటు విచారించిన సిట్, తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కేటీఆర్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆయన కూడా ఊహించని కీలక సాక్ష్యాలను…

