బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ వికారాబాద్లో కొవ్వత్తుల ర్యాలీ
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ (విహెచ్పీ) ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత ఆగస్టు నెల నుంచి బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని వక్తలు పేర్కొన్నారు. మతపరమైన గుర్తింపు…

