యూరియా, కరెంట్, కాలువల పూడికతో రైతులు ఆందోళనలో… దుబ్బాక–సిద్దిపేట రైతుల సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర ఆవేదన
తెలంగాణ అసెంబ్లీలో దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతుల సమస్యలపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత, కరెంట్ సమస్యలు, కాలువల పూడిక, సాగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సభా వేదికగా వివరించారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కల్వల ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, 2023లో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ దెబ్బతిందని, అప్పట్లో కేసీఆర్ నాయకత్వంలో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినా ఇప్పటివరకు అది పెండింగ్లోనే ఉందన్నారు. ఆ…

