ఉద్యమం నుంచి రాజకీయాల వరకు… తెలంగాణ ఉద్యమకారుల న్యాయం కోసం వేచి చూస్తున్నాం
2001లో టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఒక కార్యకర్త తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి చేరిన ఆయన, కేసీఆర్ పిలుపు ఇచ్చిన ప్రతి ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. 2008లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన నిరసనల్లో పాల్గొని బస్సుల ధ్వంసం, ధర్నాలు చేసినందుకు మూడు రోజుల పాటు జైలులో కూడా ఉన్నామని చెప్పారు. తెలంగాణ భవన్లో ఉద్యమకారులను సత్కరించిన రోజులు తమ జీవితంలో మర్చిపోలేని సంఘటనలని…

