మీసేవ ఆపరేటర్లపై వేట… చలానా కుంభకోణం నేపథ్యంలో 632 మందికి షాక్
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో వెలుగులోకి వచ్చిన చలానా కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భూసంబంధిత సేవల్లో జరిగిన అవకతవకలపై విచారణ వేగవంతం చేస్తూ 632 మంది మీసేవ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. భూభారతి–ధరణి వ్యవస్థలో చలానాల అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 37 కేసులు నమోదు కాగా, సంబంధిత వ్యక్తులపై చర్యలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మీసేవ ఆపరేటర్లపై కఠిన…

