కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్పై బీఆర్ఎస్ ఆరోపణలు – రిగ్గింగ్ ప్లాన్ చేసారన్న సంచలన ఆరోపణలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి చెలరేగుతోంది. ఈ క్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎమ్మెల్యే మొహినుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్ పథకం వేసారని ఆరోపించింది. బీఆర్ఎస్ నేతల ప్రకారం, జూబ్లీహిల్స్లోని పోలింగ్ బూత్ నెంబర్లు 66, 67లో ప్రిసైడింగ్ అధికారులను బెదిరించి, బీఆర్ఎస్ ఏజెంట్ను మొహినుద్దీన్ బలవంతంగా బయటకు పంపించారని తెలిపారు. అంతేకాకుండా, గుర్తింపు కార్డులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది….

