ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు – నందినగర్ నివాసంలోనే విచారణకు ఆదేశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన అధికారిక నివాసంలోనే విచారణకు హాజరు కావాలని స్పష్టంగా ఆదేశించింది. ఇటీవల సిట్ నోటీసులకు స్పందించిన కేసీఆర్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా తనపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, మరొక అనుకూలమైన తేదీ ఇవ్వాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read More

వికారాబాద్ 17వ వార్డులో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థిని – అభివృద్ధే లక్ష్యమని ప్రకటన

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసినట్లు అభ్యర్థిని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన తండ్రి ప్రజాప్రతినిధిగా ఉన్న కారణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు. “నా తండ్రి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ, ఆయన అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండలేని పరిస్థితులు ఉంటాయి. అందుకే నేను ఇక్కడే ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి, సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను” అని ఆమె చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడం…

Read More

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అడుగు – పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకు సాగుతున్న యువ నాయకులు

జనసేన పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు ముందుకు సాగుతోంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రభావంతో అనేక మంది యువకులు రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో జనసేనలో చేరుతున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాజమల్లయ్య మాట్లాడుతూ, తాను ఎన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానినని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అభివృద్ధి తనను రాజకీయాల వైపు నడిపించిందని తెలిపారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, తన…

Read More

వికారాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ పూర్తి బలం: 34 వార్డులకు 34 అభ్యర్థులు – మోడీపై పెరిగిన ప్రజల నమ్మకం

వికారాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది. మున్సిపాలిటీలోని మొత్తం 34 వార్డులకు 34 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించడం పార్టీ బలానికి నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు బీజేపీకి అభ్యర్థులే లేవని విమర్శించిన రాజకీయ ప్రత్యర్థులే, ఈరోజు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీగా, సర్పంచ్ ఎన్నికల్లో ఒకరి నుంచి 24 మందికి ఎదిగిన పార్టీగా బీజేపీ ఎదుగుదలను గమనిస్తున్నారని పార్టీ నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజల నమ్మకం…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు, అరెస్ట్ ప్రచారం రాజకీయ హైప్ మాత్రమే

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. నోటీసులు అంటేనే అరెస్ట్ అన్నట్లుగా కొందరు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా, వాస్తవ పరిస్థితి అంత తీవ్రమైనది కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టం ప్రకారం 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలవాల్సిన అవసరం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం, అలాంటి వ్యక్తిని ఆయన నివాసంలోనే విచారించాలి. ఇదే విషయాన్ని…

Read More

నామినేషన్‌కు హౌస్ టాక్స్ ఎన్ఓసి తప్పనిసరా? స్పష్టమైన నియమాలు చూపాలంటూ అభ్యర్థుల ప్రశ్న

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియపై తీవ్ర గందరగోళం నెలకొంది. నామినేషన్ వేయాలంటే తప్పనిసరిగా హౌస్ టాక్స్ ఎన్ఓసి తీసుకురావాలనే నిబంధన ఎక్కడ ఉందో స్పష్టంగా చూపాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన ఫారం, చెక్‌లిస్ట్‌లో ఎక్కడా హౌస్ టాక్స్ చెల్లించాలి లేదా ఎన్ఓసి తీసుకురావాలనే నిబంధన లేదని అభ్యర్థులు అంటున్నారు. అలాంటప్పుడు తమను ఎందుకు చెల్లింపులు చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదకుల విషయంలో కూడా ఒక్కరు సరిపోతారని బుక్‌లో ఉన్నప్పుడు ఇద్దరు ప్రతిపాదకులు కావాలంటూ…

Read More

నైనీ బొగ్గు టెండర్లు ఢిల్లీకి: కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరిన సూట్‌కేసుల పంచాయతీ?

తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైనీ బొగ్గు బావుల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, స్థానిక కాంగ్రెస్ నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం హస్తిన దాకా వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ సంస్థాగత నియమకాలు, మున్సిపల్…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జన సమితి తీవ్ర అసంతృప్తి: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తమ పార్టీ నేతలు, కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని కోదండరాం వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ముగింపు పలకడం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను…

Read More

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం: నేడు వీడియో కాన్ఫరెన్స్, వచ్చే నెల రెండో వారంలో పోలింగ్

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. షెడ్యూల్ విడుదలకు ముందు నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్ శాఖ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల అనంతరం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం….

Read More

మున్సిపల్ ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లపై రాజకీయ మౌనం: 56% టికెట్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం – బీసీ జేఏసీ హెచ్చరిక

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కావాలని పక్కదారి పట్టిస్తున్నారని బీసీ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. గంగపుత్ర సంఘం, బీసీ జేఏసీ, మహిళా సంఘాలు, వివిధ బీసీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్న సమావేశంలో ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన బీసీ జేఏసీ నేతలు, తెలంగాణలో జరిగిన కులగణన ప్రకారం బీసీలు 56 శాతం జనాభా ఉన్నప్పటికీ, మున్సిపల్…

Read More