పరిశుభ్రతపై కఠిన హెచ్చరికలు… మూడు కార్పొరేషన్లపై ఫీల్డ్ విజిట్స్ ఆదేశించిన రేవంత్ రెడ్డి
రాజధాని ప్రాంతాల్లో పరిశుభ్రత, పట్టణాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టే దిశగా ముందుకెళ్తోంది. మూడు నగర పాలక సంస్థల పరిధిలో శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెత్త కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు వర్తిస్తాయి. పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో…

