వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలు: 34వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మేడం లక్ష్మి ప్రచారం, అభివృద్ధే లక్ష్యమని హామీ
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 34వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా మేడం లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వెంకటేశ్వర కాలనీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె “భరత్ మాతాకి జై”, “జై శ్రీరామ్” నినాదాలతో కాలనీవాసులను ఉద్దేశించి మాట్లాడారు. తాను బీజేపీ తరపున 34వ వార్డుకు పోటీ చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తానని మేడం లక్ష్మి తెలిపారు. ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని, ఓటు వేసి గెలిపించాలని కాలనీవాసులను కోరారు. ఈ…

