అమీన్పూర్ ల్యాండ్ కబ్జాలపై సంచలన ఆరోపణలు: హైడ్రా బుల్డోజర్ల తర్వాత కూడా కడీలు… శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
అమీన్పూర్ (పటాన్చెరు నియోజకవర్గం)లో భూ కబ్జాల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పాటైన హైడ్రా (HYDRA) పదేపదే బుల్డోజర్ చర్యలు చేపడుతున్నా, అదే స్థలంలో మళ్లీ కబ్జాలు జరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. అమీన్పూర్ హెచ్ఎంటీ కాలనీలో కాటసాని రాంభూపాల్, సిస్లా రమేష్, సిస్లా లోహిత్ కలిసి ప్లాట్లను అక్రమంగా ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఇప్పటివరకు…

