గోదావరి జలాలపై వివాదం: తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు
గోదావరి జలాలపై తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కేంద్ర జల సంఘం (CWC) సమావేశం నేపథ్యంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12న విడుదల కాగా, అందులో గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా అంశాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జలాల విషయంలో…

