ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సజ్జనార్ నేతృత్వంలో బలోపేతమైన సిట్, నెలలో దర్యాప్తు పూర్తి ఆదేశాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తును మరింత బలోపేతం చేస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ, నెలరోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్, సిద్ధిపేట…

