ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు – నందినగర్ నివాసంలోనే విచారణకు ఆదేశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన అధికారిక నివాసంలోనే విచారణకు హాజరు కావాలని స్పష్టంగా ఆదేశించింది. ఇటీవల సిట్ నోటీసులకు స్పందించిన కేసీఆర్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా తనపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, మరొక అనుకూలమైన తేదీ ఇవ్వాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read More

మంత్రుల తీరుపై కేడర్ అసంతృప్తి: సమిష్టి బాధ్యత లేకపోవడంపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చలు వేడెక్కుతున్నాయి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో, పాలనా విధానాలు మరియు మంత్రివర్గ ప్రవర్తనపై పార్టీ కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, క్యాబినెట్ నిర్ణయాలపై సమిష్టి బాధ్యత లేకపోవడం, ప్రతిపక్ష విమర్శలకు వెంటనే కౌంటర్ ఇవ్వకపోవడం, అలాగే మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాలు పార్టీ లోపలే చర్చకు దారి తీస్తున్నాయి. 🔹 మంత్రుల మధ్య సమన్వయం లోపం? కేడర్ వాదన ప్రకారం, కొందరు మంత్రులు మాత్రమే ప్రజల ముందుకు…

Read More

జూబ్లీ హిల్స్ బైపోల్స్: ఇద్దరు మంత్రులపై అధిష్టానం అసంతృప్తి – వివరణ కోరనున్న కాంగ్రెస్ లీడర్‌షిప్

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, ప్రచారంలో పలు మంత్రుల పనితీరుపై పార్టీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు ముఖ్య మంత్రులపై అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకమాండ్‌కు చేరిన నివేదికల ప్రకారం, ఈ ఇద్దరు మంత్రులు తమకు కేటాయించిన డివిజన్లలో సీరియస్‌గా ప్రచారం చేయలేదని,“చుట్టూ తిరిగే హాజరు చూపించడం తప్ప—కనీస స్థాయి వ్యూహాత్మక పని కూడా చేయలేద”అని ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: హోరాహోరీ ప్రచారానికి తెర, అభివృద్ధి–వ్యూహాలపై కసరత్తు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ముగిసి, హోరాహోరీ పోరు నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సవాల్ సవాల్‌గా మారిన ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారింది. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నిక ప్రజానాడిని అంచనా వేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలు — బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ — ఏ ఒక్కటీ వెనుకడుగు వేయలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు,…

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నిక హీట్లో అజారుద్దీన్ మంత్రి పదవి: రాజకీయ ఆరోపణలు ముదురుతున్నాయి

జూబిలీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం రాజకీయ ప్రపంచంలో పెద్ద చర్చకి దారితీసింది. ఈ నియామకాన్ని అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గవర్నర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి ప్రమాణ స్వీకారం ఆపేందుకు ప్రయత్నాలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేశానికి కీర్తి తెచ్చిన క్రీడాకారుడికి మంత్రి పదవి రావడాన్ని అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ధెబ్బ అని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. రాజస్థాన్ ఉపఎన్నిక ముందు బీజేపీ అభ్యర్థినే…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి: మైనారిటీ మంత్రివర్గంపై చర్చ – అజరుద్దీన్ ప్రమాణ స్వీకారంపై వివాదం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో మైనారిటీ ప్రతినిధిత్వం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో తీసుకోవడం పై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమ ఆరోపణల్లో, మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని, రెండు సంవత్సరాలుగా మైనారిటీకి మంత్రిపదవి ఇవ్వకపోయి, ఎన్నికల…

Read More

ఆర్టీఐలతో భూ కేటాయింపుల దందా బహిర్గతం – రేవంత్ కేబినెట్‌లో అంతర్గత పావులు కదలిక?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లో కొత్త సంచలనం.తాజాగా వివిధ భూ కేటాయింపులు, టెండర్లు, కాంట్రాక్ట్ పనుల వివరాలు తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్టీఐ (RTI) దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. వీటిలో కొన్ని మంత్రులే లేదా వారి అనుచరులే పెట్టినవని సమాచారం. ఆర్టీఐల ద్వారా ఎన్ని కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి, వారి టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు, భూముల కేటాయింపుల జాబితా, ఇవన్నీ కూడా కోరుతున్నారని తెలుస్తోంది.దాంతో జిల్లా స్థాయి అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొందరు అధికారులు…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రంగంలోకి కెసిఆర్ – కేటీఆర్, హరీష్ రావుతో కీలక బేటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహరచన, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం…

Read More

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయం వేడెక్కింది – హేమ జిల్లోజి గారు స్పందన

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చాంశంగా నిలుస్తున్నది బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయం చుట్టూ తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న వేళ, సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఆమాద్మీ పార్టీ మహిళా నాయకురాలు హేమ జిల్లోజి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు….

Read More

జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్‌: బిఆర్ఎస్‌కు సానుభూతి వర్కవుట్ అవుతుందా? కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రణాళికతో గట్టి పోటీ

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షన్‌ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడంతో ఈ బై ఎలక్షన్ అవసరమైంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సానుభూతి తరంగం అధికార పార్టీకి మద్దతు ఇస్తుందనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో సానుభూతి ఫ్యాక్టర్ బిఆర్ఎస్‌కు వర్కవుట్ కాలేదనే వాస్తవం ఇక్కడ కూడా పునరావృతం కావచ్చని…

Read More