అనుమతులతో మాకేం పని?”.. ప్రైవేట్ విద్యాసంస్థల దందాపై తీవ్ర విమర్శలు
రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కొన్ని బ్రాంచ్లకు అనుమతులు రద్దు చేసినప్పటికీ, యాజమాన్యాలు మాత్రం “మాకేం పని?” అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదిత్య విద్యాసంస్థల వ్యవహారం ఇప్పుడు విద్యాశాఖలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఆదిత్య విద్యాసంస్థలకు చెందిన ఆరు బ్రాంచ్ల అనుమతులను విద్యాశాఖ రద్దు చేసినట్లు సమాచారం. నిబంధనలు పాటించకపోవడం, విద్యార్థుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు….

