మేయర్లు, చైర్మన్లకు శిక్షణ… ప్రభుత్వ పథకాల అమలుపై ఫోకస్, రాజకీయ విమర్శలు కూడా!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, పరిపాలనా విధులపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శిక్షణ కార్యక్రమాలు మార్చి మొదటి వారంలో నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. శిక్షణలో ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర…

