జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓట్ల సిండికేట్? బక్కా జార్సన్ సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రోజురోజుకూ హాట్ టాపిక్ అవుతోంది. దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ విషయంపై రాజకీయ విశ్లేషకుడు బక్కా జార్సన్ గారు ఓకే టీవీతో మాట్లాడారు. జార్సన్ గారు మాట్లాడుతూ — “భోగస్ ఓట్లు అంటూ ఇప్పుడు బిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఓట్లు కొత్తవి కావు. ఇవి గత ప్రభుత్వ కాలంలోనే నమోదైనవి. ఎన్నికల కమిషన్ ముందుగా విచారణ చేసి నిజాలను బయట పెట్టాలి. ఇప్పుడు ఒక్కసారిగా ఎన్నికల సమయంలో…

