రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…

Read More

యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్ను.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా ప్రభుత్వ వ్యవహారం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను తలపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీల అభివృద్ధి కంటే భూములు లాక్కోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని మండిపడ్డారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్నేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రెండున్నరేళ్లలో మారిపోతుందని, ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ విస్తరణకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే…

Read More

తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలో షూటింగ్స్ దందా?చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భద్రతా లోపాలు, విద్యార్థినుల ఆందోళన

తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి మహిళా కళాశాల) లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగినప్పటికీ, ఎప్పుడూ కూడా కళాశాల నడుస్తున్న సమయంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదని పూర్వ విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు. కోటి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినిగా, అలాగే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకురాలిగా ఉన్న రోజుల్లో ఒక్క విద్యార్థినికీ అన్యాయం జరగకుండా చూసుకున్నామని…

Read More

సీఎం ఓయు పర్యటనకు ముందే విద్యార్థులు–నిరుద్యోగుల అరెస్టులు: “మేము సైలెంట్‌గా ఉన్నా ఎందుకు అరెస్టు?” అనడిగిన బాధ

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు ముందు విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు చేపట్టిన అరెస్టులు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఎలాంటి ఆందోళనలు చేయబోమని ముందురోజే ప్రకటించినప్పటికీ, అకస్మాత్తుగా పోలీసులు ఇళ్లకు చేరుకుని విద్యార్థులను స్టేషన్‌లకు తరలించడం వివాదాస్పదమైంది. ఒక నిరుద్యోగి యువతి ఆవేదన ఇలా వ్యక్తం చేసింది: “మేము సైలెంట్‌గా ఉన్న వాళ్లం. ఎలాంటి ప్లాన్ లేదు. వినతిపత్రం ఇస్తామంటే అదే చెప్పాం. మరి పైనుంచి ఆర్డర్లు లేకుండా పోలీసులు వస్తారా? నిన్ననే చెప్పారు, ‘న్యూసెన్స్…

Read More