టిడిపి ప్రస్తావనతో కొత్త రాజకీయ సందేశమా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శల వర్షం
ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. టిడిపిని దెబ్బతీసిన బిఆర్ఎస్ను “100 మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తెలంగాణలో ఆ పార్టీకి స్థానం ఉండకూడదని, గ్రామాల్లో బిఆర్ఎస్ దిమ్మెలు కూలాలని పిలుపునిచ్చిన రేవంత్ మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు టిడిపి ప్రస్తావన ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు…

